CM Revanth | పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ..

CM Revanth | పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ..
CM Revanth | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్(Rising 2047 Vision Document) గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.
