చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట గ్రామ విజయ్ జేబీ వెంచర్ ఆవరణలో గురువారం ఏనుగు మాధవరెడ్డి 18 మెట్టు గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ ను వైభవంగా నిర్వహించారు.
అయ్యప్ప స్వామికి గురు స్వాములు పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కచేరి నిర్వహించారు. గురుస్వాములకు సన్మానాలు చేశారు. అయ్యప్ప మాలదారులకు అన్నప్రసాధ వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జేబీ వెంచర్ యజమాని విజయ్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ చక్రం జంగయ్య, మాజీ ఉప సర్పంచ్ ఏనుగు బాలమణి మాధవరెడ్డి తదితర నాయకులు తదితర నాయకులు, గురుస్వాములు, అయ్యప్ప స్వాములతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

