ఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం బోర్డు ఈ రిజల్ట్స్ ప్రకటించింది. విద్యార్థులు తాము సాధించిన స్కోరును https://cbseresults.nic.in/ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్ ల ద్వారా కూడా రిజల్ట్స్ పొందొచ్చు. కాగా 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
మొత్తం 17,04,367 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 16,92,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
14,96,307 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విజయవాడ టాప్
సీబీఎస్ఈ ఫలితాల్లో విజయవాడ (99.60 శాతం)లో అధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది.
త్రివేండ్రం – 99.32 శాతం.
చెన్నై – 97.39 శాతం.
బెంగళూరు – 95.95 శాతం.
ఢిల్లీ వెస్ట్ – 95.37 శాతం.
ఢిల్లీ ఈస్ట్ – 95.06 శాతం.
చండీగఢ్ – 91.61 శాతం.
పంచకుల – 91.17 శాతం.
పూణే – 90.93 శాతం.
అజ్మీర్ – 90.40 శాతం.
భువనేశ్వర్ – 83.64 శాతం.
గౌహతి – 83.62 శాతం.
డెహ్రాడూన్ – 83.45 శాతం.
పాట్నా – 82.86 శాతం.
భోపాల్ – 82.46 శాతం.
నోయిడా – 81.29 శాతం
79.3 శాతంతో ప్రయాగ్రాజ్ చిట్ట చివరన ఉంది.