నేరడిగొండ, మే 11(ఆంధ్ర ప్రభ) : మండల కేంద్రంలోని రోల్ మమడ టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొక యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన అన్వేష్, వెంకటేష్ అనే ఇద్దరు యువకులు తమ కారులో నిర్మల్ వైపు వెళ్తుండగా… ఉదయం 7 గంటల సమయంలో మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, డాక్టర్ పరిశీలించి వెంకటేష్ అనే యువకుడు మృతి చెందినట్లు, అన్వేష్ అనే యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ADB | ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
