ఉత్తరాఖండ్ : బస్సు నదిలో పడడంతో 11మంది గల్లంతైన ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని రుద్రప్రయాగ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Breaking | నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
