అమరావతి: బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారన్నారు. అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం ముంచేసిందన్నారు.
కూటమి ప్రభుత్వం బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించిందని, . కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మ స్తుతి, పరనిందాగానే బడ్జెట్ సాగిందన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్ని పొగడడం తప్ప ఏమీ లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదని అంటూ ఇది షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి అంటూ వ్యాఖ్యానించారు బొత్స.
మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయన్నారు. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలన్నారు… కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు . ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదని అన్నారు.
50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం అని బొత్స పేర్కొన్నారు. కానీ అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలని అయితే ఆ మేరకు బడ్జెట్ లో కేటాయింపులు ఏవని ప్రశ్నించారు బొత్స. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదన్నారు.. ఉచిత బస్సు పథకం పేరేత్తలేదన్నారు…. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్పై కేసు పెట్టారన్నారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు..
అంకెలే తప్ప అభివృద్ధి కానరాలేదు: ఎమ్మెల్సీ రవిబాబు
చంద్రబాబు, లోకేష్ ని పొగిదేందుకే సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమే.
బడ్జెట్ పేరుతో మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొన్నారు. మహాశక్తికి కేటాయింపులే లేవన్నారు. నిరుద్యోగులను రూపాయి కూడా కేటాయింపు చేయకుండా నిట్టనిలువునా ముంచారన్నారు. 12 వేల కోట్లు తల్లికి వందనంకి కావాలని,.. కానీ కేటాయింపులు అరకొరగా కేటాయించారని అన్నారు. రైతుల్ని మోసం చేశారని, . కోటి 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. 95లక్షల కి కుదించారని మండిపడ్డారు కల్యాణి..4వేల కోట్లు అవసరం ఐయితే రెండున్నర వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్పై పెడితే బాగుండేదన్నారు.
బడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి
ఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ వైసిపి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి . వైఎస్ జగన్ ఐఆర్ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం.. వీసీలు 17 మందిని బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని ఆధారాలు బయట పెడతాం.. ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తాం.
అంకెల గారడీ మాత్రమే: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్రా
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. తల్లికి వందనం లో కోత పెట్టారు. చేనేతలను ఆదుకునే ఒక్క పథకం లేదు. గృహ నిర్మాణ కేటాయింపులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసింది. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు అని బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు.