హదరాబాద్ – రాబోయే రోజుల్లో అధికారం మనదే అని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు.. ఎవరితో పొత్తు లేకుండానే స్వంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. గోదావరి ఖని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నీటి కోసం చేపట్టిన పాదయాత్ర నేడు ఎర్రవెల్లికి చేరింది.. ఈ సందర్బంగా చందర్, అయనతో పాటు వచ్చిన ఇతర నేతలు ఫామ్ హౌజ్ లో ఉన్న కెసిఆర్ తో బేటి అయ్యారు . ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని విమర్శించారు. ఏపీలో కూటమి లేకుంటే సీఎం చంద్రబాబు గెలిచేవారు కాదని చెప్పారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపారని మండిపడ్డారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదని చెప్పారు. అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని ఉద్ఘాటించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో పెట్టకపోయిన రైతుబంధు, కల్యాణ లక్ష్మీ పథకాలను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని కేసీఆర్ ఉద్ఘాటించారు.
తాము అధికారంలో ఉన్న పదేళ్లు తెలంగాణలో ఒక్క సమస్య కూడా లేకుండా చూశామని పేర్కొన్నారు.. ఇప్పుడు తెలంగాణాలో అన్ని సమస్యలేనని అన్నారు.. ఇప్పుడు తెలంగాణ సిరిసంపదలు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు.. తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ నని అన్నారు.. ఎవరికీ ఏదీ శాశ్వతం కాదని, ఈ నేల ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని అన్నారు కెసిఆర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చలేకపోయిందని కెసిఆర్ విమర్శించారు.. అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని నేతలను కోరారు. తెలంగాణలో ఈసారి తాము ఎవరితో పొత్తు లేకుండానే ఘన విజయం సాధిస్తామని చెప్పారు. బెల్లం ఉన్న చోటికే ఈగలు వస్తాయన్నారు..