గోదారిలో వ్యక్తి గల్లంతు

కుక్కునూరు ..బెస్తాగూడెం అయ్యప్పగా గుర్తింపు
( కుక్కునూరు, ఆంధ్రప్రభ)
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గోదావరి రేవులో ఓ వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం గల్లంతయ్యారు. బెస్తగూడెం గ్రామానికి చెందిన కుమ్మరపల్లి నాగార్జున (25) సహ మాలాధారులతో కలిసి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఆయన నదిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
