AP | అసెంబ్లీ స‌భ్యుల ఫోటో సెష‌న్…

స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో క్లిక్

ముందుగా ఎమ్మెల్యేల‌తో ఆ త‌ర్వాత ఎమ్మెల్సీల‌తో
ప‌వ‌న్ కల్యాణ్ కు బొత్స అప్యాయ ప‌ల‌కరింపు
అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో అర‌కు కాఫీ స్టాల్ ప్రారంభం


వెల‌గ‌పూడి, ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీల ఫొటో సెషన్ జరిగింది.

మరోవైపు ఈసందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటో సెషన్ ముగించుకుని వెళుతున్న సమయంలో పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలకరించారు. ‘ఎలా ఉన్నారు ? బాగున్నారా ?’ అని బొత్స పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.

అసెంబ్లీ అవ‌ర‌ణ‌లో అర‌కు కాఫీ స్టాల్..
అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి గుమ్మ‌డి సుధారాణి, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌కు అర‌కు కాఫీ ఫ్యాక్ ల‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *