Assembly | బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు

Assembly | బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు
Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించారు. బీసీ కాంపోనెంట్ కోసం ఏకంగా రూ. 51,021 కోట్లు కేటాయించడం ఆ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోంది. అలాగే ఎస్సీ కాంపోనెంట్ కోసం రూ. 20,644 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ కోసం రూ. 9,190 కోట్లు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం రూ. 6,090 కోట్లు కేటాయించి ప్రభుత్వం ఆయా వర్గాలకు భారీ శుభవార్త వినిపించింది.
