Asian Badminton.. ఫిబ్రవరి 11 నుంచి షురూ !
చైనాలోని కింగ్డావోలో ఫిబ్రవరి 11 నుంచి బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్ ప్రారంభం కానుంది. కాగా, ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే షట్లర్లను భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బీఏఐ) ఇప్పటికే ఎంపిక చేసింది.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, పారిస్ ఒలింపిక్స్ సెమీ-ఫైనలిస్ట్ లక్ష్యసేన్ 14 మంది సభ్యుల భారత జట్టుకు నాయకత్వం వహించనున్నారు. 2023 టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. సింధు, లక్ష్యసేన్లతో పాటు ఆసియా క్రీడల బంగారు పతక విజేతలు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, ఒలింపియన్ హెచ్ఎస్ ప్రణయ్ తదితరులు ఈ జట్టులో ఉన్నారు.
భారత జట్టు..
పురుషులు: లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, కె.సతీష్ కుమార్
మహిళలు: పీవీ సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ, అశ్వినీ పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్యా వరియాత్