- శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని,జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కారం వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి 61 మంది నుంచి పిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే తెలియచేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు.
ప్రజా పిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు.ముందుగా జిల్లా ఎస్పీ స్వయంగా వృద్దులు, వికలాంగుల అర్జీ దారులు తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి అధికారులకు ఆదేశించారు. పిర్యాదులు వివరాలు మొత్తం 61 స్వీకరించగా అందులో కుటుంబ సమస్యలు, మోసపూరితమైన, ఆస్తి తగాదాల, సివిల్ ఇతరత్రా అంశాలు ఉన్నాయి.

