జీ.కే వీధి (ఆంధ్రప్రభ):మండలంలోని ఎర్రగడ్డ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి తిరిగి వస్తుండగా బొడ్డే గొయ్యి గ్రామానికి చెందిన గిరిజన మహిళ కొర్ర లలిత గర్భిణీ పురిటి నొప్పులు ఎక్కువ కావడం వలన మార్గమధ్యలోనే ఆమె ప్రసవం చేసారు డాక్టర్ అచ్చుత్. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. .
వివరాలలోకి వెళితే బొడ్డే గొయ్యి గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు వస్తున్నాయని విషయం తెలుసుకొని అంబులెన్స్ ఆపేసి కాలినడకన ఈత రోబ్బలు జంక్షన్ నుండి ఆరు కిలోమీటర్ల నడిచి డాక్టర్ అచ్చుత్ గ్రామానికి చేరుకొనే లోపు ఎదురుగా గ్రామస్తులు డోలిమోతతో తీసుకొని వస్తున్నారు
ఇక మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువగా అవుతున్న విషయం గ్రహించి అక్కడే ప్రసవం చేసారు.
అనంతరం తల్లికి బిడ్డకు వైద్యం అందించి అక్కడ నుండి అంబులెన్స్ లో జీ.కే వీధి ఆసుపత్రికి వైద్యుడు తీసుకువెళ్లారు .తల్లికి వైద్యం అందించి బిడ్డకు చేయవలసిన టీకాలు వేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు అచ్చుత్,ద్వారక భాయ్,వైద్య సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.