AP | సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు…

నందిగామ, (ఆంధ్రప్రభ): నియోజకవర్గంలోని ముప్పాళ్ళ గ్రామంలో ఏప్రిల్ 5న (శనివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలతో పాటు ఆయన బహిరంగ సభలో పాల్గొనున్నారు.

సీఎం పర్యటన దృష్ట్యా ఏప్రిల్ 5న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.

సీఎం చంద్రబాబు నాయుడు చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో బహిరంగ సభ పర్యటన సందర్భంగా ఈ ప్రాంతాన్ని రూరల్ సీఐ చవాన్ కలిసి ట్రాఫిక్ ఏడిసిపి ఏబీఎన్ ప్రసన్నకుమార్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించను. నందిగామ నుండి చందర్లపాడు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు లో చందర్లపాడు, చింతలపాడు, ఏటూరు,తోటరాలపాడు వైపు నుండి వచ్చే వాహనాలు తొర్లపాడు మీదగా కంచెల గ్రామం నుండి కీసర నందిగామ, విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

నందిగామ నుండి తోటరావులపాడు వైపు వెళ్లే వాహనాలు చందాపురం, కేత వీరుని పాడు తోర్లపాడు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నందిగామ నుండి చందర్లపాడు వైపు వెళ్లే వాహనాలు డివిఆర్ కాలనీ అడివిరావలపాడు కోనేయపాలెం బొబ్బిలిపాడు మీదగా చందర్లపాడు వైపు వెళ్లాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *