AP | వైఎస్ జగన్‌కు నోటీసులు, కారు సీజ్ !

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఇటీవల గుంటూరు సమీపంలో జరిగిన సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి కేసులో జగన్‌కు సంబంధించి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ కేసులో విచారణ అవసరమంటూ పోలీసులు నేడు (మంగళవారం) స్వయంగా తాడేపల్లిలోని జగన్ పార్టీ కార్యాల‌యానికి వెళ్లి నోటీసులు అందజేశారు. అయితే జగన్ ప్రస్తుతానికి అక్కడ లేకపోవడంతో, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అంద‌జేశారు. సింగయ్య మృతికి కారణమైన వాహనం – జగన్ ప్రయాణించిన టయోటా ఫార్చ్యూనర్ (AP40DH2349) ను పోలీసులు సీజ్ చేశారు.

Leave a Reply