AP | మెగా డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల…

విజయవాడ (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025 లో భాగంగా 3 శాతం క్రీడా కోటా నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయం లో బుధవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.

మెగా డీఎస్సీ లో విడుదల చేసిన 16,347 పోస్ట్ ల్లో క్రీడా కోటా క్రింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోటా కు ఎంపికను పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నిష్పక్షపాతంగా కేవలం అర్హులందరికీ న్యాయం జరిగిలా చర్యలు తీసుకున్నామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదన్నారు. ఫేక్ సర్టిఫికెట్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీకి అర్హులైన క్రీడాకారులు మే 2 నుండి మే 31 వరకు వెబ్‌సైట్లలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మెగా డీఎస్సీలో క్రీడా కోటా క్రింద ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 333 పోస్టులు, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 30 పోస్టులు, ఏపీ ట్రైబల్ వెల్ ఫేర్ ఆశ్రమ్ పాఠశాలల్లో 22 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2 పోస్టులు, ఏపీ మోడల్ పాఠశాలల్లో 4 పోస్టులు, ఏపీ సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7 పోస్టులు, ఏపీ గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 23 పోస్టులు కేటాయించినట్లు వివరించారు.

క్రీడలలో ప్రతిభ చూపిన యువతకు ఇది ఒక అపూర్వ అవకాశం. స్థిరమైన జీవితం, గౌరవం, ఉద్యోగ భద్రత లభించేందుకు ఇది చక్కటి మార్గమన్నారు. సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ గిరీష, శాప్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *