రాజమండ్రి: ఏపీ లోని రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం (, akhand godavari) ప్రాజెక్ట్కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ( gajendra singh shekhawat) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( pawan ky) కలిసి నేడు శంకుస్థాపన చేశారు.పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ను చేపట్టారు.
శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది.సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శ్రీకారం చుట్టారు. రాజమండ్రి వద్ద గోదావరిపై 127 సంవత్సరాల పాత రైల్వే వంతెనను టూరిజం స్పాట్గా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం డొక్కా సీతమ్మ అని, ఆదికవి నన్నయలకు జన్మనిచ్చిన నేల గోదావరి తీరమని పేర్కొన్నారు. రూ. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డబుల్ ఇంజన్ సర్కార్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర మంత్రి షెకావత్ సహకారం అందించారన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం షెకావత్ సహకారం అందించారని కొనియాడారు. ఏపీలో 974 కిలోమీటర్ల నదీ తీరం ఉందని, విదేశాల్లో నదీ తీరాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసిన విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. 2035 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కు ప్రారంభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపద్యంలో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు ప్రటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ సహా కూటమి నాయకులు పాల్గొన్నారు.