AP | భక్తులకు గుడ్ న్యూస్.. కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ రెడీ!

కడప జిల్లా ప్రజలకు, ముఖ్యంగా కాశీనాయన జ్యోతి క్షేత్ర భక్తులకు గుడ్ న్యూస్. కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు కాశీనాయన జ్యోతికి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

ఈ విషయంపై సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్, అటవీ శాఖ, ఆర్టీసీ శాఖ సమన్వయంతో భక్తుల ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా.. గతంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాలను కూడా భక్తుల కోసం తిరిగి తెరుస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.

“ప్రజా ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. భక్తుల శ్రద్ధకు తగిన విధంగా సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం,” అని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ చర్యపై భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply