AP CM | ప్ర‌పంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్

AP CM | ప్ర‌పంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్

  • ఇప్పుడు విశాఖ‌లో..
  • సీఎం చంద్ర‌బాబు

AP CM | విశాఖ, ఆంధ్ర‌ప్ర‌భ : విశాఖ- కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

AP CM
  • ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోంది.
  • చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి.
  • ఇప్పుడు విశాఖకూ కాగ్నిజెంట్ అడుగుపెట్టింది.
  • గతంలో హైదరాబాద్ లో రూపోందించిన ఎకోసిస్టంతో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు.
  • 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది.
  • కాగ్నిజెంట్ లో 85 శాతం మంది భారతీయులే. ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం.
  • భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో 1 లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
  • 3 దశాబ్దాల క్రితం చేసిన విజన్ తోనే దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం ఇస్తున్నారు.
  • 1995లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూషన్ తో పాటు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం.
  • అందుకే ఐటీకి బ్యాక్ బోన్ గా భారతీయులు నిలిచే పరిస్థితి వచ్చింది.
  • హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ ను ఆహ్వానించాం.
  • 11 నెలల్లోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు.
  • త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారు కావాలి.
  • ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోంది.
  • భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయి.
  • ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుంది.
  • నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగింది.
  • కాగ్నిజెంట్ తోపాటు 8 సంస్థలకు ఇవాళ భూమి పూజ చేశాం.
  • గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది.
  • ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయి.
  • ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు.
  • దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20 శాతం జీవన వ్యయం కూడా తక్కువ.
  • ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటిగా విశాఖను తీర్చిదిద్దుతాం.
  • దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖే.
  • 2032కి 130 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుంది.
  • ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్ గా తయారైంది.
  • గుజరాత్ లో టాటా నానో కారు తయారీ కేంద్రానికి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున భూమి ఇచ్చారు.
  • ఇటీవలే భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూల ద్వారా రూ. 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • అలాగే ఎస్ఐపీబీల ద్వారా మరో రూ .8.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చేశాం.
  • నేషనల్ క్యాంటం మిషన్ ను అందిపుచ్చుకుని ఏపీలోని అమరావతిలో క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
  • దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోంది.
  • ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉంది.
  • రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్లు ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి.
  • పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఎస్క్రో ఖాతాను పెడుతున్నాం. ఈ తరహాలో ఆలోచించే ప్రభుత్వాలు ఉండవు.
  • ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం.
  • సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను కూడా రూపొందిస్తున్నాం .
  • రియల్ టైమ్ గవర్నెన్సు, డేటా లేక్ ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నాం .
  • రియల్ టైమ్ లోనే క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాచారం అందించేలా చేస్తున్నాం.
  • 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోంది.
AP CM
AP CM

Leave a Reply