AP | ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం..!

AP | ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం..!
- గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
● కులమతాలకు అతీతంగా అందరికి ఓటు హక్కు
● ఘనంగా 16 వ జాతీయ ఓటరు దినోత్సవం
● సీనియర్ ఓటర్లను సత్కరించిన జిల్లా కలెక్టర్
● యువ ఓటర్లకు గుర్తింపు కార్డులు , సైకిల్ ర్యాలీలు
AP | గుంటూరు కలెక్టరేట్ – ఆంధ్రప్రభ : ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం లభించిందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓటరు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. కుల, మత బేధాలు లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం ద్వారా సమాన అవకాశాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.

అన్ని వర్గాలకు ఓటు హక్కును కల్పించిన ఘనత మన దేశానికి దక్కుతుందన్నారు. ఓటరుగా సమాజాన్ని తీర్చిదిద్దరంలో కీలక పాత్ర వహించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొన్నారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సమాజంలో సమూలమైన మార్పులకు నాంది పలకవచ్చని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియను సైతం ఎన్నికల కమిషన్ సులభతరం చేసిందని ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చని అన్నారు. ఓటరుగా నమోదు కాకుండా మిగిలి ఉన్న యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు ఒక వజ్రాయుధమని దాని విలువ ఎంతో గొప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు ప్రతి పౌరునిలో బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైనదని దానిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికీ అనేక మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని ఓటరు సరళి చూసినపుడు అవగాహన అవుతుందన్నారు. ఓటు వేయడం మన బాధ్యత, హక్కు అన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల ప్రక్రియ ఓటు హక్కు వలన సజావుగా సాగుతోందన్నారు. బూత్ స్థాయి అధికారులు ఓటు నమోదు ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు, ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు.
ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. సీనియర్ ఓటర్లను సత్కరించారు. యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, రాజకీయ పార్టీల ప్రతినిధులు – టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, ప్రతినిధులు ఓమ్ కార్, కంచర్ల శివ రామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బిళ్ళా సునీల్, బి.ఎస్.పి ప్రతినిధి సి.హెచ్. వాసు, జనసేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, అప్ పార్టీ ప్రతినిధి డాక్టర్ సేవ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
