Accident | పరిగి వద్ద ఆటోను ఢీకొన్న వాహనం – నలుగురు మహిళలు దుర్మరణం

శ్రీ సత్యసాయి బ్యూరో ఏప్రిల్ 13 (ఆంధ్రప్రభ):శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సమీపంలోని పరిగి మండలం ధనాపురం క్రాస్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా 11 మంది కి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వారు ఆటోలో హిందూపురం సమీపంలోని కొటిపి చౌడేశ్వరి దేవి ఆలయం ను దర్శించుకుని తిరిగి వస్తున్నారు. పరిగి సమీపంలోని ధనాపురం క్రాస్ వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మరో మహిళ చికిత్స పొందుతూ కన్నుమూసింది.

మృతుల పేర్లు

సాకమ్మ, అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ

వీరంతా ఒకే గ్రామం కు చెందినవారు. మరో 11 మందికి గాయాలైనట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి వుంది .పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *