హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు. ఇవాళ ఉదయం సమయంలో బాబ్జీని అటుగా వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
హయత్నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద బాబ్జీ వాకింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాబ్జీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ డీజీపీ ఆఫీసులో బాబ్జీ విధులు నిర్వర్తిస్తున్నారు.