Accidenrt | బైక్ ను ఢీకొన్న వాహనం – ఇద్దరి మృతి

పెద్దపల్లి ఆంధ్రప్రభ – ద్విచక్ర వాహనాన్ని (bike _) గుర్తు తెలియని వాహనం (vehicle) ఢీ కొట్టిన (rampage ) ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట (aappannapeta ) వద్ద చోటుచేసుకుంది. గోదావరిఖని పట్టణానికి చెందిన చక్రి, శ్యామ్ హైదరాబాద్ నుండి గోదావరిఖని కి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అప్పన పేట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీ కి తరలించారు.

Leave a Reply