Hyderabad | తెగిప‌డిన హైటెన్ష‌న్ విద్యుత వైర్లు – ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం

హైద‌రాబాద్ – : హైదరాబాద్ ఎల్బీనగర్‌లో (LB Nagar ) ఆదివారం తెల్లవారుజామున (Early Hours of Sunday ) విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్ (Sagar ring road) వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు ( HT wirts ) తెగిపడి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు బిక్షాటన (Beggars ) చేసే వ్యక్తులు, ఓ వీధికుక్క అక్కడికక్కడే సజీవదహనమయ్యారు (Burned) . ఈ ఘటన తెల్లవారుజామున సమయంలో చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ తీగలు బీడింగ్ తెగిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కరెంట్ నిలిపివేయడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.

మృతులిద్దరూ బిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్న వ్యక్తులుగా గుర్తించబడినప్పటికీ వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైటెన్షన్ వైర్ల భద్రతా లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.

ఉత్తరాఖండ్ శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) డాక్టర్ వి. మురుగేశన్ వెల్లడించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్, మ‌రో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని ఆయన ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం, భౌగోళిక పరిస్థితుల నడుమ ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *