న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నేడు నిర్వహించనున్న డిఫెన్స్ డ్రిల్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. ఆపరేషన్ సిందూరు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ డ్రిల్స్ ను రద్దు చేస్తునట్లు ప్రకటించింది.. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో డ్రిల్ నిర్వహించనునట్లు కేంద్ర ప్రకటించింది.
హైదరాబాద్లో ‘ఆపరేషన్ అభ్యాస్’.. సైరన్ మోగితే అవన్నీ బంద్!
నగర వ్యాప్తంగా నేడు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనునట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా నగరమంతా సైరన్ల మోత మోగనుంది. సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. సాయంత్రం 4.15 గంటలకు నగరంలోని నాలుగు చోట్ల (సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీలో) మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఈ మాక్ డ్రిల్లో 12 సివిల్డీఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి. సాయంత్రం 4 గంటలకు నాలుగు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నగరమంతా సైరన్లు మోగించనున్నారు. అన్ని కూడళ్లలో రెండు నిమిషా పాటు సైరన్లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రికల్ పరికరాలు, లైట్లు, స్టవ్లు ఆపాలని అధికారులు సూచించారు. కాగా కేంద్ర ప్రకటనతో ఈ డ్రిల్ ను రద్దు చేశారు.