ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది.
బీజేపీ కోటా కింద పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యారు. వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీకి నామినేషన్ ప్రక్రియ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.