Commissioner | 37.25 శాతం హాజరు..

Commissioner | 37.25 శాతం హాజరు..

  • ప్రశాంతంగా యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పరీక్ష
  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

Commissioner | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ఈపీఎఫ్వో పరీక్ష – 2025 ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నగరంలో 15 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. 5,860 మంది అభ్యర్థులకుగాను 2,183 మంది (37.25 శాతం) హాజరయ్యారు. కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని సీవీఆర్ ఉన్నత పాఠశాల, చిట్టూరి హైస్కూలు, ప్రభాస్ పీజీ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్‌వైజ‌ర్లు, సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు తెలిపారు.

Leave a Reply