Pakistan | వ్యాన్ లోయ‌లో ప‌డి 16 మంది మృతి

క‌రాచీ: పాకిస్థాన్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డిన ఘ‌ట‌న‌లో 16మంది మ‌ర‌ణించారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. సుమారు 30మంది గాయ‌ప‌డ్డారు. సింధు ప్రావిన్సులోని జామ్‌షోరో జిల్లాలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. అతి వేగంతో వెళ్తున్న డ్రైవ‌ర్‌.. బ‌స్సును అదుపు చేయ‌లేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. స్పాట్‌లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ ప్రావిన్సులోని కొల్హి తెగ‌కు చెందిన వ్య‌క్తులు సింధు ప్రావిన్సుకు వెళ్తున్నారు.

పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాయి. ప్ర‌మాద బాధితుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బలూచిస్తాన్‌లో గోధుమ పంట కోత త‌ర్వాత కార్మికులు త‌మ స్వ‌స్థ‌లానికి తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. గాయ‌ప‌డ్డ‌ వారిలో చాలా మంది ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *