KNL |యోగా మన వారసత్వ సంపద : మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వేల సంవత్సరాల నుండి వస్తున్న యోగా (Yoga) మన వారసత్వ సంపద అని, చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ (Minister T.G. Bharat) పేర్కొన్నారు. ఇవాళ‌ ఉదయం కర్నూలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, విద్యార్థులు ఎన్ సీసీ విద్యార్థులు, మహిళలు, అధికారుల భాగస్వామ్యంతో 5వేల మందితో నిర్వహించిన థీమాటిక్ యోగా ప్రదర్శన నిర్వహించారు.. యోగా శిక్షకులు మునిస్వామి యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేయించారు.

అనంత‌రం భరత్ మాట్లాడుతూ… యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 11లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని, కర్నూలు జిల్లా (Kurnool District) మొదటి స్థానంలో నిలిచిందని అభినందించారు. యోగా ఐదు వేల సంవత్సరాల నుండి మనకు వారసత్వంగా వస్తోందని, యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు యోగా చేయడం అలవర్చుకోవాలని తెలిపారు. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించి, ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చర్యలు తీసుకున్నారన్నారు.

ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి విశాఖపట్నం (Visakhapatnam) సముద్రతీరంలో ఐదు లక్షల మందితో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేలాగా ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈకార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, సీఈవో సెట్కూర్ వేణుగోపాల్, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, ఎన్ సి సి కల్నల్ ప్రసాద్, డిస్ డి ఓ భూపతి రావు, కార్పొరేటర్ పరమేష్, ఆయుష్ డా.ప్రసాద్, మునిస్వామి, జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్, జిల్లా అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, సాధారణ ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply