Yoga Day | వచ్చే నెల 21వ తేదీన విశాఖకు రానున్న ప్రధాని

విశాఖపట్నం : ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21వ తేదీన విశాఖలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది. విశాఖలో ఏటా తూర్పు నౌకాదళం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, జిల్లా యంత్రాంగం వేర్వేరుగా యోగా దినోత్సవాలు నిర్వహిస్తుంటాయి. ఈ కార్యక్రమాలలో మోదీ పాల్గొననున్నారు.

Leave a Reply