మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన జాతీయ వాలీబాల్ ప్లేయర్ పుల్లారి అనన్య శ్రీ(Pullari Ananya Shri)ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy) అభినందించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari) ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా అనన్య శ్రీ సాధించిన సీనియర్ నేషనల్ గోల్డ్ మెడల్(Senior National Gold Medalist), ఎఫ్.ఐ.ఎస్.యూ వరల్డ్ యూనివర్సిటీ మెడల్ ఇతర స్థాయిలో సాధించిన మెడల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించడం జరిగింది. ఈ సందర్భంగా అనన్యను ముఖ్యమంత్రి అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Birla Ailaiah), భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, పుల్లారి ఆనంద్,,వరలక్ష్మి,,ఆదిత్య ,,సౌర్య తదితరులు పాల్గొన్నారు.