రష్యాకు చెందిన వెరోనికా కుడెర్మెటోవా – బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్ జోడి 2025 వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఈరోజు (ఆదివారం) జరిగిన ఫైనల్ పోరులో హ్సీహ్ సువీ – జెలెనా ఒస్టాపెంకో జంటను 3-6, 6-2, 6-4 స్కోరుతో మట్టికరిపించారు.
కుడెర్మేటోవాకు ఇది డబుల్స్ విభాగంలో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. రెండో సారి వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచిన మేర్టెన్స్కి మాత్రం ఇది ఐదో గ్రాండ్ స్లామ్ విజయం.