కోల్ కతా : కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ చట్టం తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో వక్ఫ్ బిల్లు పాస్ చేయడానికి బీజేపీ సర్కార్ వద్ద సంపూర్ణ మెజారిటీ లేదని.. కానీ, చంద్రబాబు, నితీశ్ కుమార్లు దీనికి మద్దతిచ్చి సైలెంట్గా కూర్చున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్లో నిర్వహించిన ఓ ముస్లిం మత పెద్దల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారం కోసం.. మీ ఆత్మగౌరవాన్ని అమ్మేసుకుంటారా? ఇంతలా దిగజారుతారా? అని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. దీదీ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.