శంకర్పల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా రైతు సంబరాలు జరుగుతుంటే శంకర్పల్లి పరిధిలోని మోకిల క్లస్టర్లో రైతు సంబరాల సమాచారం రైతులకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని వ్యవసాయ అధికారులను రైతులు నిలదీశారు. ఈ సంఘటన మోకిల క్లస్టరలో జరిగింది. ఈ మధ్య జరిగిన మోకిల రైతువేదిక వద్ద పిఎసిఎస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రైతులు మోహన్ రెడ్డి, చిన్న విట్టలయ్య, శ్రీనివాస్, సత్తయ్య, యాదయ్యతో పాటు చాలామంది వ్యవసాయ అధికారులను నిలదీశారు. గ్రామాల్లో సమాచారం అందించి, చాటింపు వేసి గ్రాండ్గా జరపాల్సిన కార్యక్రమం.. అధికారుల నిర్లక్ష్యంతో నీరు గారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా మని వారు పేర్కొన్నారు. గ్రామానికి కనీసం 50 మందికి సమాచారం ఇచ్చిన 400 మంది రైతులతో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో వెంకయ్య గౌడ్ మధ్యలో కలగజేసుకొని రైతులను శాంతింపజేశారు. ఈ విషయాన్ని కచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈవో రామకృష్ణారెడ్డి, ఇన్చార్జి ఏవో కవితపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు రైతులు తెలిపారు.
