వెలగపూడి,: ఏపీలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం,నె ల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగుల హెచ్చరికల నేపథ్యంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది.