KNL | పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.. మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో , జూన్ 14, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాకు పరిశ్రమలు తీసుకుని రావడానికి, విధ్యాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నదని పరిశ్రమలు, వాణిజ్యం అండ్‌ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ (T.G. Bharat) పేర్కొన్నారు. శనివారం ఉదయం కర్నూలు పట్టణ ఉస్మానియా కాలేజీ ఆవరణలో నిర్మించిన రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్ష అభియాన్ (రూసా) ఆధ్వర్యంలో ఒక కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు అండ్ సిబ్బందిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… ఉస్మానియా కళాశాల పూర్వపు విద్యార్థి అయిన నేను రాష్ట్ర మంత్రిగా రూసా నిర్మించిన అదనపు తరగతుల భవనాల (Additional classes of buildings) ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాశాలలోని సిబ్బంది అందరితోనూ త‌నకు పరిచయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కళాశాలలో చదువుకున్న వారిలో చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారని, రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తున్నారని తెలిపారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి టీ.జీ.భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు (Bastipati Nagaraju) ను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్, సెక్రటరీ, కరస్పాండెంట్ ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్.గజని, కార్పొరేటర్ పరమేష్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *