Vikarabad | భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ నాయకుల పూజ‌లు

వికారాబాద్, మే 11 (ఆంధ్రప్రభ ) : భారత ప్రభుత్వం, సైన్యానికి మద్దతుగా బుగ్గరామలింగేశ్వరాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం, సైన్యానికి మద్దతుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బుగ్గ రామలింగేశ్వరాలయంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్ రెడ్డి, మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత సమయంలో ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా నిలవాలని, అదేవిధంగా అంతర్గతంగా ఉన్న దేశ విచ్చిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని, దేశ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రధాని మోడీకి మనం అండగా ఉండాలన్నారు. బుద్ది మారని పాకిస్తాన్ కు మన దేశ సైన్యం సమర్ధవంతంగా తగిన జవాబు ఇస్తుందని చెప్పారు. దేశ రక్షణ పరంగా ఇండియా చాలా బలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రవీణ్ కుమార్, పడమటి శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, యాదగిరి, విఠల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply