AP | రాజారెడ్డికి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల నివాళులు

పులివెందుల, మే 29 (ఆంధ్రప్రభ) : వైఎస్ రాజారెడ్డి శతజయంతి వేడుకలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డిలు గురువారం హాజరై పట్టణంలోని డిగ్రీ కాలేజ్ రోడ్డు సమీపంలో ఉన్న వైయస్ రాజారెడ్డి ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో వైయస్ రాజారెడ్డి శతజయంతి కేకును వారు కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్ రాజారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరన్నారు. పులివెందుల ప్రజల కోసం ఆయన ఎప్పుడూ తపించేవారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *