Vikarabad | అకాల వర్షంతో దెబ్బతిన్న కూరగాయ పంటలు

వికారాబాద్, మే 15 (ఆంధ్రప్రభ): గురువారం ఉదయం ఐదు గంటల నుండి 8 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాలైన వికారాబాద్, నవపేట్, పూడూర్, పరిగి, తదితర మండలాల్లో కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి.

ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు మూడు గంటలపాటు ఎటువంటి గాలి లేకుండా కురిసిన వర్షంతో నీరు ఏరులై పారింది. తరచూ విద్యుత్ కు అంతరాయం ఏర్పడడంతో సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. రైతులకు చేతికి వచ్చిన కూరగాయ పంటలకు భారీ వర్షంతో నష్టం వాటిల్లింది. ప్రధానంగా టమాటా, తదితర పంటలు పూర్తిగా నేలరాలాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *