హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం కోసం రాజిరెడ్డి పార్ధివ దేహాన్ని హబ్సిగూడలోని ఆయన నివాసంలో ఉంచారు.
రాజిరెడ్డి మృతికి మాజీ మంత్రి తలసాని సంతాపం…
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతికి మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఇవాళ ఉదయం మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మరణించడంతో హబ్సిగూడలోని నివాసానికి వెళ్లి రాజిరెడ్డి పార్దీవ దేహంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.