రూ.3882 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లు ప్రారంభం
భారతదేశ వైవిధ్యానికి కాశీ ప్రతీక అంటూ ప్రశంస
వారణాసి – కాశీ ప్రేమకు తాను రుణపడి ఉన్నానని అన్నారు ప్రధాని మోదీ. కాశీ నాది, నేను కాశీకి చెందినవాడిని. గత 10 సంవత్సరాలలో బనారస్ అభివృద్ధి కొత్త ఊపును తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. నేడు కాశీ పురాతనమైనది కాదు, అది ప్రగతిశీలమైనది కూడా. కాశీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించే దిశగా అడుగులు వేసిందని అన్నారు.
ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో నేడు మోదీ పర్యటించారు.. ఈ సందర్భంగా వారణాసికి 3880 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చారు.అలాగే రోడ్లు, విద్యుత్, విద్య, పర్యాటక రంగానికి సంబంధించిన 44 ప్రాజెక్టులను ప్రారంభించారు, మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన కాశీ ఇప్పుడు పురాతనమైనది మాత్రమే కాదు, ప్రగతిశీలమైనదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కాశీ ప్రేమకు రుణపడి ఉన్నాను. ఇప్పుడు కాశీ పూర్వాంచల్ ఆర్థిక కేంద్రంగా అవతరించింది. కాశీ ఆధునిక కాలాన్ని వారసత్వంతో సమతుల్యం చేసిందని అన్నారు. కాశీ పూర్వాంచల అభివృద్ధి రథాన్ని స్యయం ఆ మహాశివుడే లాగుతున్నారన్నారు. పూర్వాంచల్లో సౌకర్యాలు విస్తరిస్తున్నాయి. భారతదేశ వైవిధ్యానికి కాశీ అత్యంత అందమైన చిత్రం.
మన మంత్రం సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని అన్నారు. తాము దేశం కోసం ఆ ఆలోచనను ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. కానీ కొందరు అధికారం దక్కించుకోవడానికి రాత్రింబవళ్లు ఆటలు ఆడుతున్న వారి సూత్రం కుటుంబ మద్దతు, కుటుంబ అభివృద్ధి మాత్రమే అన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే మంత్రాన్ని సాకారం చేసుకునే దిశలో పశుసంవర్ధక కుటుంబాలకు, ముఖ్యంగా కష్టపడి పనిచేసే మన సోదరీమణులకు ప్రత్యేక అభినందనలు అని ప్రధాని మోదీ వారణాసి ప్రజలకు తెలిపారు. ఈ సోదరీమణులు తమను నమ్ముకుంటే కొత్త చరిత్ర రాయవచ్చని చూపించారన్నారు. ప్రతి ప్రాంతానికి, కుటుంబానికి, యువతకు మెరుగైన సౌకర్యాలను అందించాలని సంకల్పించామన్నారు. ఈ పథకాలన్నీ పూర్వాంచల్ను అభివృద్ధి చేసే దిశలో మైలురాళ్ళుగా మారబోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
‘కాశీలోని ప్రతి నివాసి ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతారని మోదీ అన్నారు. దీనికి కాశీ వాసులతో పాటు పూర్వాంచల్లకు అభినందనలు’ అని అన్నారు. మహిళా శక్తితో అడపడుచుల ఆత్మవిశ్వాసం, వారి సామాజిక సంక్షేమం కోసం మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే తమ జీవితాంతం కృషి చేశారు. ఈ రోజు మనం ఆయన తీర్మానాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కాశీ ఆధునిక యుగాన్ని స్వీకరించిందని, వారసత్వాన్ని పరిరక్షించిందని, భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే దిశగా బలమైన చర్యలు తీసుకుందని మోదీ అన్నారు. నేడు కాశీకి ఎవరు వెళ్ళినా అక్కడి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను ప్రశంసిస్తున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది బనారస్కు వస్తారు, స్వామి విశ్వనాథ్ను సందర్శించి, గంగా మాతలో స్నానం చేస్తారు. ప్రతి ప్రయాణికుడు అంటారు – బనారస్ చాలా మారిపోయింది. అని తెలిపారు.
భారతదేశ ఆత్మ దాని వైవిధ్యంలో నివసిస్తుందని, కాశీ దాని అత్యంత అందమైన చిత్రం అని మోదీ అన్నారు. కాశీలోని ప్రతి ప్రాంతంలోనూ ఒక విభిన్న సంస్కృతి కనిపిస్తుంది, ప్రతి వీధిలోనూ భారతదేశ విభిన్న రంగు కనిపిస్తుంది. కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా, ఈ ఐక్యతా బంధాలు నిరంతరం బలపడుతున్నాయని సంతోషంగా ఉన్నానన్నారు. నేడు భారతదేశం అభివృద్ధి, వారసత్వం రెండింటినీ కలిపి ముందుకు సాగుతోందని అన్నారు. మన కాశీ దాని ఉత్తమ నమూనాగా మారుతోంది. ఇక్కడ గంగా ప్రవాహం ఉంది. భారతదేశం చైతన్య ప్రవాహం కూడా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఆ నిందితులను కఠినంగా శిక్షించండి
ప్రధాని మోదీ లోక్సభ నియోజకవర్గం వారణాసిలో ఇటీవల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ టూర్లో ఉన్న మోదీ వారణాసిలో ల్యాండ్ కాగానే అధికారులను కలిశారు. యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి సంపూర్ణ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలీసులు, కలెక్టర్ తో ప్రధాని మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. హోటళ్లు, హుక్కా సెంటర్లు తిప్పుతూ అఘాయిత్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. దీనిపై మోదీ తీవ్రంగా స్పందించారు.. అమానవీయ ఘటనగా ఆయన దానిని అభివర్ణించారు.