నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 9(ఆంధ్రప్రభ) : దేశవ్యాప్తంగా పసుపు రైతులకు చారిత్రాత్మక మైలురాయి అయిన తెలంగాణలోని నిజా మాబాద్లో జాతీయ పసుపు బోర్డు (National Yellow Board) ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా (Amit Shah) చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind), జాతీయ పసుపుబోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డిలు ఆహ్వానం అందజేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్ప ర్సన్ పల్లె గంగారెడ్డి లు సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా సన్మానించారు.
ఈసందర్భంగా పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం తమ చేతుల మీదుగా జరగాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగో (Yellow board official logo) ను కూడా ఆవిష్కరిస్తారు. ఇది భారతదేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ, ప్రపంచ మార్కెట్ యాక్సెస్ కొత్త శకానికి ప్రతీక. నిజామాబాద్లో బోర్డు, దాని ప్రధాన కార్యాలయం ఏర్పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో రైతుల గొంతును గౌరవించడానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాగ్దానాలను దృఢ సంకల్పం, సమగ్రతతో నెరవేర్చడానికి భారత ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో జరుగుతుం ది. ఈ కార్యక్రమం ఖచ్చితమైన తేదీ, సమయాన్ని సకాలం లో ప్రకటిస్తారు. ఈ ముఖ్యమైన సందర్భం భారతదేశ వ్యవసాయ దృశ్యంలో, ముఖ్యంగా పసుపు సాగుదారుల కు ఒక మలుపు తిరు గుతుంది. సహకార సంఘాల స్ఫూర్తిని, రైతుల నేతృత్వంలోని అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుంది.