Third One day | శుభమ్ గిల్ సూపర్ సెంచరీ…
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ శుభమ్ గిల్ అద్భుత శతకం సాధించాడు.. మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 52 పరుగులు చేసిన కోహ్లీ రెండో వికెట్ గా వెనుతిరిగాడు.
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇక రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 6 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ బరిలోకి వచ్చి గిల్ తో కలసి బ్యాటింగ్ చేశాడు.. వీరిద్దరూ కలసి రెండో వికెట్ కు 116 పరుగులు జోడించారు. 55 బంతులలో 52 పరుగులు చేసిన కోహ్లీ స్పిన్నర్ అదిల్ రషిద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం గిల్ 102, శ్రేయస్ అయ్యర్ 43 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు..
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. జేమీ ఒవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ ను తీసుకుంది.