వేములవాడ, ఆంధ్రప్రభ : మిడ్ మానేరు ప్రాజెక్టు(The project) నిర్వాసితులు 1550 మందికి ప్రత్యేక ప్యాకేజి కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి(Chief Guest)గా పాల్గొన్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
నిర్వాసితులకు మేలు చేస్తాం
మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ(State Govt) లక్ష్యమని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు వేములవాడ అర్బన్ మండలం అగ్రహరంలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రూ.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు.
ప్రత్యేక ప్యాకెజి(Package) కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ(Distribution) చేస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణములో నిర్వాసితులైన తొమ్మిది గ్రామాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1,550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశామని, ఒక్కో ఇంటికి రూ. ఐదు లక్షల(Five Lakhs) చొప్పున లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. గత మేలో దాదాపు 389, ప్రత్యేక కోటా కింద 950, ప్రస్తుతం 1550 తో కలిపి 2889 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.
ఆందోళన వద్దు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియనే ఆది శ్రీనివాస్ అన్నారు. అర్హులు ఎవరు ఆందోళన చెందవద్దని, అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నాలుగు విడతల్లో రూపాయల ఐదు లక్షల సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం(this program)లో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సింగిల్ విండో రేగులపటి కృష్ణ దేవరాయలు, హౌసింగ్ శాఖ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్(District Audit Officer Srinivas), వేములవాడ తహసీల్దార్ విజయ్ ప్రకాష్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్ర తదితరులు పాల్గొన్నారు.


