AP | అన్ని వర్గాలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం : దేవినేని అవినాష్‌

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు, వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ (Devineni Avinash) విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో యువత పోరు కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమానికి ఎన్టీఆర్ (NTR) జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ అవుతూ శైలజ, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర లు సంపూర్ణ మద్దతు తెలిపారు.

నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవినేని అవినాష్ ((Devineni Avinash) మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ వారు ప్రజలను మభ్యపెట్టారన్నారు. నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికి అందటం లేదని, దీనిపై యువతకు నారా లోకేష్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ హయంలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని తెలిపారు.

Leave a Reply