రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని వెల్లడించారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితా తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరు కావాలని సూచించారు.