శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో, రాచకొండ పోలీస్ కమిషనరేట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపు (ఏప్రిల్ 6న) హైదరాబాద్లోని అన్ని వైన్ షాపులు మూసివేయనున్నట్టు తెలిపింది. రేపు(ఏప్రిల్ 6వ తేదీ) శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
నగరంలోని వైన్సులు, బార్లతో పాటు కల్లు దుకాణాలు కూడా బంద్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.