హైదరాబాద్ – ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గద్దర్ ఫౌండేషన్కు (Gaddar Foundation ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State ) రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి (Birth Anniversary )వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపనుంది.
ఇది ఇలా ఉంటే ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహాణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. మరోవైపు, గద్దర్ పేరుతో సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు
