TG | రైతు భరోసా విజయోత్సవం.. ముఖ్యమంత్రి రేవంత్ లైవ్ !

రాష్ట్రవ్యాప్తంగా నేడు రైతు భరోసా (Raithu Bharosa) విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం (Raithu Nestham) కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy), మంత్రులందరూ పాల్గొన్నారు.

వానాకాలం పంటకు రైతు భరోసా నిధుల జమ ఇవాళ్టితో పూర్తి అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో రూ.9 కోట్ల నిధులు జమ చేసినందుకు, ఘనంగా సంబురాలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. రైతుభరోసా నిధుల జమ నేటితో పూర్తి కానుంది.

ఈ నెల 16న ఖరీఫ్ సీజన్‌లో 70 లక్షల 11 వేల 984 మంది రైతులకు, కోటీ 49 లక్షల 35 వేల ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రకటించారు.

సోమవారం వరకు 15 ఎకరాలలోపు భూములకు సంబంధించి 67 లక్షల వెయ్యి మంది రైతులకు రూ.8 వేల 284 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో రైతు నేస్తం విజయోత్సవ సభ జరుగుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి సభ నుద్దేశించి ప్రసంగిస్తున్నారు.

Leave a Reply