హైదరాబాద్ : బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. రచయిత, గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి గానం చేసిన బండెనక బండి కట్టి – గులాబీల జెండ పట్టి బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆవిష్కరించారు.
నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాల్ని రూపొందించాలని ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ రసమయికి సూచించారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.